న్యూఢిల్లీ: దేశంలోని సుమారు నాలుగు నుంచి ఐదు స్టార్టప్ కంపెనీలలో 50–100 మిలియన్ డాలర్ల చొప్పున ఇన్వెస్ట్ చేయాలని సాఫ్ట్బ్యాంక్ చూస్తోంది. యూనికార్న్లుగా మారడంలో ఈ ఇన్వెస్ట్మెంట్స్ సాయపడతాయని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ చేసింది.
బిజినెస్ టూ కన్జూమర్స్ (బీ2సీ), ఎంటర్ప్రైజ్, మీడియా సెక్టార్లలోని స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేసేందుకు సాఫ్ట్బ్యాంక్ 400–500 మిలియన్ డాలర్లను రెడీ చేసుకుందని వెల్లడించింది. కానీ, ఈ అమౌంట్ ముందనుకున్న దాని కంటే తక్కువ. ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్ల నుంచి కూడా వాటాలను కొనే ఆలోచనలో సాఫ్ట్బ్యాంక్ ఉంది.
టెక్ వాల్యుయేషన్ వీక్గా ఉండడంతో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో జాగ్రత్తగా ఉంటున్నామని సాఫ్ట్బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ గతంలో ప్రకటించారు.