అమిత్ షాకు సోనియా గాంధీ సవాల్.. దమ్ముంటే అడుగుపెట్టండి

అమిత్ షాకు సోనియా గాంధీ సవాల్.. దమ్ముంటే అడుగుపెట్టండి

దేశంలో హింసాత్మక వాతావరణం సృష్టించడమే మోడీ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని మోడీ, షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టంతో ఈశాన్య భారతం రగులుతోందని, ఈ సమయంలో అక్కడ అడుగుపెట్టడానికి కేంద్రం హోం మంత్రి అమిత్ షా కూడా భయపడుతున్నారని అన్నారు. ఆయనకు దమ్ముంటే ఈ పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలని సవాల్ విసిరారు సోనియా.

దేశ చరిత్రలోనే తొలిసారి శాంతి భద్రతలు బాగోలేవని ఇతర దేశాల ప్రతినిధులు తమ పర్యటనలు రద్దు చేసుకున్నారని అన్నారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి, జపాన్ ప్రధాని తమ టూర్‌లను క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి దేశంలో ఏర్పడిందన్నారు. అలాగే ఢిల్లీ జామియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దాడి చేయడంతోనే మోడీ ప్రభుత్వ పతనం మొదలైందని సోనియా అన్నారు.