కరోనా పేషెంట్ల కోసం మళ్లీ రైల్వే ఐసోలేషన్ కోచ్​ లు

కరోనా పేషెంట్ల కోసం మళ్లీ రైల్వే ఐసోలేషన్ కోచ్​ లు

కరోనా సెకండ్​వేవ్​ విజృంభిస్తుండగా కొవిడ్​పేషెంట్ల కోసం దక్షిణ మధ్య రైల్వే ఐసోలేషన్ కోచ్​లను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. సమ్మర్ ​ఎండలను తట్టుకునే విధంగా వీటిని రూపొందించింది. దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో సుమారు 4,000 కొవిడ్​రక్షిత కోచ్​లు  ఏర్పాటు చేశారు. పంజాబ్​కు కోచ్​లను పంపేందుకు సిద్ధంగా ఉంచారు. ఢిల్లీలోని షాకూర్​బస్తీ స్టేషన్ లో 800 బెడ్లతో 50 కోచ్​లు, (ఆనంద్​విహార్​ టెర్మినల్​ 400 బెడ్లతో 25 కోచ్​లు, మహారాష్ట్ర నందూర్బర్​లో 378 బెడ్లతో 21 కోచ్​లు, బోపాల్​ స్టేషన్​వద్ద  640 బెడ్లతో 40 కోచ్​లు  ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వాల అవసరం మేరకు మరిన్ని ఐసోలేషన్​కోచ్​లను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.