ప్రతి కేసును పక్కాగా విచారణ చేయాలి : ఎస్పీ హర్షవర్ధన్

ప్రతి కేసును పక్కాగా విచారణ చేయాలి : ఎస్పీ హర్షవర్ధన్

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : ప్రతి కేసును పక్కాగా విచారణ చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ హర్షవర్ధన్  ఆదేశించారు. బుధవారం పోలీస్​ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్​ ఆఫీసర్లతో నేరాలపై రివ్యూ చేశారు. నేరాలపై దృష్టి పెట్టాలని, నమోదైన ప్రతి కేసులో పక్కాగా విచారణ చేపట్టాలని సూచించారు. స్టేషన్ల వారీగా గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో కేసు వివరాలను పరిశీలించారు.

కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచేందుకు పోలీస్  ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. దొంగతనం కేసులను వీలైనంత త్వరగా ఛేదించాలని సూచించారు. అంతకుముందు 2022 బ్యాచ్ కి చెందిన ప్రొబేషనరి ఎస్పీ చిత్తరంజన్ కు స్వాగతం పలికి, అధికారులకు పరిచయం చేశారు. ఏఆర్  ఏఎస్పీ సురేశ్ కుమార్, డీఎస్పీ మహేశ్, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి పాల్గొన్నారు.