
హైదరాబాద్, వెలుగు: - షిర్డీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (ఎస్ఎస్ఈఎల్) అనుబంధ సంస్థ అయిన ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుజిల్లా రామాయపట్నం వద్ద ఏర్పాటు చేసిన ఫెసిలిటీలో ఈ నెల 31 నుంచి సోలార్ మాడ్యూల్ తయారీ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 2024 జనవరిలో కేటాయించిన సుమారు 30 ఎకరాల స్థలంలో ఈ ప్రొడక్షన్ లైన్ను నిర్మించారు.
మొదటిదశను 500 మెగావాట్లతో మొదలుపెడతామని ఎస్ఎస్ఈఎల్ సీఈఓ శరత్చంద్ర చెప్పారు. ఇందుకోసం రూ.15 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు వెల్లడించారు. మిగతా రెండుదశలో కోసం మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. ఫలితంగా 23 వేల మందికి ఉపాధి దొరుకుతుంది.