కండరాలు పట్టేసినప్పుడు కాసేపు వజ్రాసనంలో ఉంటే రిలీఫ్గా అనిపిస్తుంది. జీవక్రియలు వేగంగా జరగడానికి కూడా ఈ ఆసనం పనికొస్తుంది. అయితే వజ్రాసనంలో ఐదు నిమిషాలు ఉండడం కూడా కొందరికి కష్టమవుతుంది. అలా అనిపించడానికి కారణాలతో పాటు వాటికి సొల్యూషన్ కూడా చెబుతున్నారు యోగా ఎక్స్పర్ట్ అక్షర్.
వజ్రాసనంలో ఓ రెండు నిమిషాలు ఉన్నారో లేదో కొందరికి కాళ్లు తిమ్మిర్లు పడతాయి. కాలి మడిమ బెణుకుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే....
తినేటప్పుడు, చదువుకునేటప్పుడు కూడా కుర్చీలు, సోఫాల మీద కూర్చోవడానికి అలవాటు పడిపోయారంతా. నేలపై బాసింపట్టు వేసుకుని కూర్చోవడం బాగా తగ్గిపోయింది. లైఫ్స్టయిల్లో మార్పులు, కొత్త అలవాట్ల కారణంగా మోకాళ్లు, కాలి మడిమలు బలంగా ఉండవు. దాంతో, వజ్రాసనంలో కూర్చోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది.
మోకాళ్లు, మోకాలి మడమలకి గాయాలు అయిన వాళ్లు వజ్రాసనంలో ఎక్కువ సేపు ఉండలేరు.
మోకాళ్లు, కాలి పిక్కదగ్గరి కండరాలు ఫ్లెక్సిబుల్గా లేకపోవడం వల్ల కూడా వజ్రాసనం వేయడం కష్టమవుతుంది.
ఒబెసిటీ సమస్య ఉన్నవాళ్లు ఎక్కువ టైం వజ్రాసనంలో ఉండలేరు. వీళ్లకి శరీర బరువుని మోకాళ్ల మీద బ్యాలెన్స్ చేయడం సవాల్.
కండరాలు ఫ్లెక్సిబుల్గా లేకుంటే రక్తప్రసరణ సరిగా జరగక కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి.
ఇలా చేస్తే బెటర్
ఎక్కువ సేపు కూర్చొని లేచిన ప్రతిసారి స్ట్రెచింగ్ చేయాలి. కాలి కండరాలు గట్టిపడేందుకు వాకింగ్, జాగింగ్, సైకిల్ తొక్కడం, మెట్లు ఎక్కడం వంటి ఎక్సర్సైజ్లు చేయాలి. వజ్రాసనంలో 30 సెకన్లు ఉండాలి. రోజులో నాలుగైదు సార్లు ఇలా చేయాలి. తర్వాత కంఫర్ట్ని బట్టి టైం పెంచుతూ పోవాలి.
నేలపై వజ్రాసనం వేయడం కష్టంగా ఉంటే మోకాళ్ల కింద దిండు పెట్టుకోవాలి.
బాలాసనం, పాదంగస్తాసనం, సేతుబంధాసనం, కపోతాసనం, ఆంజనేయాసనం వంటివి 15–20 సెకన్లు ప్రాక్టీస్ చేస్తే వజ్రాసనం వేయడం ఈజీ అవుతుంది.
వజ్రాసనం వేస్తే...
స్ట్రెస్ తగ్గిపోతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అసిడిటీతో పాటు పీరియడ్ క్రాంప్స్ తగ్గిపోతాయి. బరువు తగ్గుతారు. కండరాలు పట్టేయవు. మూత్రనాళ సంబంధ సమస్యలకి మందులా పనిచేస్తుంది. వెన్నునొప్పి మాయమవుతుంది.
For More News..