
దూకుడే ఆయన మంత్రం
సున్నితంగా చెప్పినా
వార్నింగ్ ల ఘాటెక్కువే
దేశవిదేశాల్లో ఇండియా గొంతు వినిపిస్తున్న అక్బరుద్దీన్
ప్రచారానికి దూరం.. పాక్కు సింహస్వప్నం
న్యూఢిల్లీ: కాశ్మీర్విషయంలో కలగజేసుకోలేమంటూ యునైటెడ్నేషన్స్సెక్యూరిటీ కౌన్సిల్ స్పష్టంచేసిన వేళ పాకిస్తాన్, చైనాప్రతినిధుల గొంతు వణుకుతుండగా.. కాశ్మీర్ అంశం మా సొంత వ్యవహారమని ఓ వాయిస్హుంకరించింది. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరంటూ పరోక్షంగా హెచ్చరించింది. దీనిపై ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలంటూ పాక్కు వార్నింగ్ఇచ్చింది. టెర్రరిజానికి గుడ్బై చెప్పాకే మీతో చర్చలకు ముందుకొస్తామని తేల్చిచెప్పింది.. అంతర్జాతీయ వేదికపై ఇండియా గొంతును ధీమాగా వినిపించిన ఆ గొంతు మరెవరిదో కాదు యూఎన్లో మన రాయబారి, సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత ప్రతినిధి సయ్యద్అక్బరుద్దీన్ది. యూఎన్భద్రతా మండలి మీటింగ్సందర్భంగా శుక్రవారం ఆయన ప్రదర్శించిన దూకుడు ఇండియన్ల మనసు గెలుచుకుంది. 1986 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ ఎస్ అధికారి సయ్యద్గతంలోనూ ఇదే దూకుడు ప్రదర్శించారు. ప్రచార ఆర్బాటాలకు దూరంగా ఉండే సయ్యద్.. కామ్గా పనిచేసుకుపోతుంటారని ఆయన కొలీగ్స్చెప్పారు.
గతంలో జరిగిన కొన్ని సంఘటనలు..
పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఓ అమెరికన్ టీవీ చానెల్ అక్బరుద్దీన్ను ఇంటర్వ్యూ చేసింది. టెర్రర్అటాక్పై ఇండియా ఎలా స్పందించబోతోంది? రివెంజ్తీర్చుకోవడానికి మిలిటరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా.. అంటూ ఇరుకున పెట్టించేలా యాంకర్ తో ప్రశ్నలు అడిగించింది. అడిగిన ప్రతీ ప్రశ్నకూ జవాబిస్తూనే ఎలాంటి కాంట్రవర్సీకి, విచారణకు ఆటంకం కలగకుండా అక్బరుద్దీన్ తెలివిగా వ్యవహరించారు. మిలిటరీ యాక్షన్తీసుకోబోతున్నారా అన్న ప్రశ్నను తిప్పికొడుతూ.. ఇండియా తరఫున మీరే ముందుగా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకర్థం కావడంలేదంటూ యాంకర్కు చురకలు వేశారు. జరిగిన దాడిని యూఎస్సభ్య దేశాలన్నీ ఖండించాలని, టెర్రర్సంస్థల నాయకుల లిస్ట్ను ప్రిపేర్చేయడానికి సహకరించాలని, టెర్రరిజాన్ని రూపుమాపడానికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని ఆ ఇంటర్వ్యూ ద్వారా అక్బరుద్దీన్ప్రపంచానికి పిలుపునిచ్చారు.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా 2013లో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో అంతర్జాతీయ మీడియా సంధించిన ప్రశ్నలకు సమర్థవంతంగా జవాబిచ్చారు. ఆ సమావేశానికి హాజరైన విలేకరులను పేర్లతో పిలిచి మరీ వారి ప్రశ్నలకు జవాబిచ్చారు. చిక్కు ప్రశ్నలకూ తడబడకుండా, వివాదాలకు తావివ్వకుండా సూటిగా జవాబిచ్చారు. ఎక్కడా అరుపుల్లేవు, వాదనల్లేవు, ప్రశ్నలడిగిన ఒక్కో పేరును పలుకుతూ జవాబివ్వడంతో విలేకరులు ఆశ్చర్యపోయారు. 2017లో భారత న్యాయమూర్తి దల్వీర్భండారి అంతర్జాతీయ న్యాయస్థానానికి రెండోసారి ఎన్నికవడంలో అక్బరుద్దీన్కృషి చాలా ఉంది. అయితే, దీనికి ఆయన క్రెడిట్తీసుకోకుండా.. బయటికి కనిపించే శక్తి తానొక్కడినే కానీ జస్టిస్ భండారి ఎన్నికలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సహకరించారని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.
2019 జులైలో జరిగిన సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్లో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి టెర్రరిజం ఎలా అడ్డంకులు సృష్టిస్తుందో వివరించారు. పాక్పేరెత్తకుండానే టెర్రరిజానికి సపోర్ట్ చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. దావూద్ఇబ్రహీం, డి కంపెనీలతో పాటు టెర్రర్సంస్థలకు ఆశ్రయమిచ్చి ప్రోత్సహిస్తోందంటూ పాక్ను కడిగిపారేశారు. క్లైమెట్చేంజ్విషయంలో ఇండియా కమిట్మెంట్ను ప్రపంచానికి స్పష్టంగా చాటిచెప్పారు. ఈ ఏడాది జులై 28న యూఎన్హెడ్క్వార్టర్లో జరిగిన ఓ కార్యక్రమంలో నారతో తయారుచేసిన బ్యాగులను పంచిపెట్టారు. ప్లాస్టిక్ వాడకాన్ని బ్యాన్చేసి, ఈ బ్యాగులను ఉపయోగించండి అంటూ వారిని కోరారు. మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాల సందర్భంగా నూలు వడుకుతున్న గాంధీ చిత్రాన్ని ఆ బ్యాగులపై ముద్రించారు.