ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా తెలంగాణ రాష్ట్ర  ఆవిర్భావ దినోత్సవం

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. పార్టీల లీడర్లు, ప్రభుత్వ అధికారులు,  కార్మిక సంఘాల నాయకులు, ప్రజలు ఆయా ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. నిర్మల్​లో మంత్రి ఇంద్రకర్​రెడ్డి, ఆదిలాబాద్​లో  విప్​ గంప గోవర్ధన్​,  ఆసిఫాబాద్​ ప్రభుత్వ విప్​ శంభీపూర్​  రాజు, మంచిర్యాలలో  బాల్క సుమన్​ పాల్గొన్నారు. అలాగే ఆదిలాబాద్​లో  బీజేపీ ఆధ్వర్యంలో  జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, పార్టీ శ్రేణులు వేడుకలు జరిపారు.  

నిర్మల్​ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ రావుల రామనాథ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రజా సంక్షేమం ,అభివృద్ధిలో తెలంగాణ  రాష్ట్రం దేశానికే ఆదర్శమని  బీఆర్​ఎస్​ లీడర్లు అన్నారు.  తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించింది. తెలంగాణ అభివృద్ధిని దేశం అనుసరిస్తుందని చెప్పుకునే స్థాయికి చేరిందని , పారదర్శకమైన పరిపాలనతో మన్ననలు పొందుతుందని  చెప్పారు.  అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహాలకు  అధికారులు, నాయకలు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. 
- వెలుగు, నెట్​ వర్క్​