న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను టాటా సన్స్ హస్తగతం చేసుకుందని మీడియాలో వస్తున్న కథనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తల్ని కొట్టిపారేసిన కేంద్రం.. వీటిలో ఎలాంటి వాస్తవాలు లేవని స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా వాటాల విక్రయానికి సంబంధించిన బిడ్పై ప్యానెల్ నిర్ణయాన్ని త్వరలో మీడియాకు తెలియజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Media reports indicating approval of financial bids by Government of India in the AI disinvestment case are incorrect. Media will be informed of the Government decision as and when it is taken. pic.twitter.com/PVMgJdDixS
— Secretary, DIPAM (@SecyDIPAM) October 1, 2021
కాగా, అప్పుల్లో ఉందనే కారణంగా ఎయిర్ ఇండియాలోని పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో పలు ప్రైవేట్ కంపెనీలు బిడ్ దాఖలు చేశాయి. ఈ లిస్టులో టాటా సన్స్ ఎక్కువ బిడ్ దాఖలు చేసి ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుందని మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా కేంద్రం ఈ విషయంపై స్పందించడంతో దీనికి బ్రేక్ పడింది. ఇకపోతే, ఎయిర్ ఇండియాను 1932 లో జేఆర్డీ టాటా స్థాపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విమానయాన రంగాన్ని జాతీయం చేయడంతో ఎయిర్ ఇండియాలో టాటా ఎయిర్లైన్స్కు ఉన్న 49 శాతం వాటాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తర్వాత కంపెనీని అప్పటి సర్కార్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చింది.