ముంబై: పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ట్రాన్స్జెండర్లు అప్లై చేసుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం బాంబే హైకోర్టుకు తెలిపింది. ఫిబ్రవరి, 2023 నాటికి వారి ఫిజికల్ టెస్ట్ల ప్రమాణాలను రూపొందిస్తామని పేర్కొంది. సీజే జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్అభయ్ అహుజాతో కూడిన డివిజన్ బెంచ్.. ‘మహారాష్ట్ర సర్కారు గాఢ నిద్రలో ఉందని, ట్రాన్స్జెండర్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నిబంధనలు రూపొందించడంలో వెనుకబడింది’అని ఆగ్రహం వ్యక్తంచేసిన మరుసటిరోజు ప్రభుత్వం స్పందించింది. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్లో 'సెక్స్' కేటగిరీలో ట్రాన్స్జెండర్ల కోసం మూడో డ్రాప్-డౌన్ను చేర్చడానికి వెబ్సైట్ను సవరించనున్నట్లు అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోని బెంచ్కు వివరించారు. అప్లికేషన్ ఫాంలు అందజేయడానికి అందరికీ లాస్ట్ డేట్ను డిసెంబర్ 15 వరకు పొడిగించినట్టు తెలిపారు. డిసెంబర్ 13 నాటికి, మూడో డ్రాప్ డౌన్ యాడ్ చేస్తామని ఏజీ చెప్పారు.