
టీఎస్పీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. 1 : 50 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో మెయిన్స్ పరీక్షల ప్రశ్నాపత్ర విధానాన్ని కమిషన్ ప్రకటించింది. గ్రూప్–1 మెయిన్స్లో మొత్తం ఏడు పేపర్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇంగ్లీష్. ఇది పదో తరగతి స్థాయిలో ఉండే అర్హత పరీక్ష. మిగిలిన పేపర్లు ర్యాంకు నిర్ధారిస్తాయి.
పేపర్–1 జనరల్ ఎస్సేలో ఆరు విభాగాలు ఉన్నాయి. వీటికి అనుగుణంగా ప్రశ్నాపత్రంలో మూడు సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్లో మూడు ప్రశ్నలుంటాయి. ప్రతి సెక్షన్ నుంచి ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు వెయ్యి పదాల్లో సమాధానం రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు యాభై మార్కులు. మొత్తం 150 మార్కులు. సెక్షన్–ఏలో సమకాలీన సామాజిక సవాళ్లు, సామాజిక సమస్యలు, ఆర్థిక వృద్ధి, న్యాయ వివాదాలు అంతర్భాగంగా ఉంటాయి. సెక్షన్ – బిలో భారత రాజకీయ వివాదాలు, భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉంటాయి. సెక్షన్–సిలో శాస్త్ర సాంకేతిక రంగాభివృద్ధి విద్యా– మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలుంటాయి.
పేపర్–2లో అంతర్భాగంగా ఉన్న అంశాలు సెక్షన్–ఏలో భారతదేశ చరిత్ర, సంస్కృతి, సెక్షన్ బిలో తెలంగాణ చరిత్ర చారిత్రక వారసత్వం, సెక్షన్–సిలో భారత్, తెలంగాణ భూగోళశాస్త్రం ప్రశ్నాపత్రంలో కూడా మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్కు యాభై మార్కులుంటాయి. ఒక్కో సెక్షన్లో ఐదు ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 200 పదాల్లో సమాధానం రాయాలి. ఒక్కో సమాధానానికి పది మార్కులు. అయితే అభ్యర్థి గమనించాల్సినది ఏమిటంటే ప్రతి సెక్షన్లోను ఉండే తొలి రెండు ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. చాయిస్ ఉండదు. అంటే సెక్షన్–ఏలో ఒకటి, రెండు ప్రశ్నలు, సెక్షన్–బిలో ఆరు, ఏడు ప్రశ్నలు, సెక్షన్–సిలో 11, 12 ప్రశ్నలు. వీటికి చాయిస్ లేదు. మిగిలిన ప్రశ్నలకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే సెక్షన్–ఏలో 3(ఏ) లేదా (బి), 4(ఏ) లేదా (బి), 5(ఏ) లేదా (బి), సెక్షన్ – బిలో 8(ఏ) లేదా (బి), 9(ఏ) లేదా (బి), 10(ఏ) లేదా (బి), సెక్షన్–సిలో 13(ఏ) లేదా (బి), 14 (ఏ) లేదా (బి), 15 (ఏ) లేదా (బి). ఒకటి, రెండు, ఆరు, ఏడు, పదకొండు, పన్నెండు ప్రశ్నలకు చాయిస్ లేదు. కాగా 3, 4, 5, 8, 9, 10, 13, 14, 15 ప్రశ్నలకు ఇంటర్నల్ చాయిస్ ఉంది. పేపర్–మూడు, నాలుగు, ఆరుకీ ఇదే విధానం ఉంది. పేపర్–5లో ఉన్న మూడు సెక్షన్లలో ఒకటి, రెండు సెక్షన్లు ఇదే పద్ధతిలో ఉన్నాయి. మూడో సెక్షన్లోని డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్కు సంబంధించి క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 40 వరకు ఉంటాయి. 30 ప్రశ్నల్లో 25 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం యాభై మార్కులుంటాయి.
జనరల్ ఇంగ్లీష్లో 15 ప్రశ్నలుంటాయి. ఇది అర్హత పేపర్ మాత్రమే. ఒక్కో ప్రశ్నకు పది మార్కులు. మొత్తం 150 మార్కులు. రీడింగ్ కాంప్రెహెన్షన్, ప్రెస్సె రైటింగ్, ఐడియా ఎక్స్పాన్షన్, లెటర్ రైటింగ్, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, సెంటెన్స్ కరెక్షన్, ఇడియమ్స్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, కరెక్షన్ ఆఫ్ స్పెల్లింగ్, హామా నిమ్స్, ప్రిపొజిషన్స్, వాయిస్ ఆఫ్ స్పీచ్, సబ్ స్టిట్యూట్ వర్క్స్, పంక్చుయేషన్ తదితర అంశాలు ఉంటాయి.
దృష్టి పెట్టాల్సిన అంశాలు
మెయిన్స్ సిలబస్కు సంబంధించిన సమకాలీన అంశాలపై ఫోకస్ చేయాలి. ఉదాహరణకు పాలిటీలో సమాఖ్య అంశాలు మౌలికంగా చదువుతూ గవర్నర్ వివాదాస్పద పాత్రను సమకాలీన అంశాలతో జోడించి చదవాలి. అంటే కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో గవర్నర్ పదవి ఎలా వివాదం అయిందో ఉదాహరణలతో తెలుసుకోవాలి. అలాగే జనరల్ ఎస్సేలో మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ చారిత్రక వారసత్వం, తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, న్యాయ వ్యవస్థలో క్రియాశీలత, పోలీస్ సంస్కరణలు వంటి సంస్కరణలు, మొదలైన అంశాలను చదవాలి.
సివిల్స్ ఆప్షన్స్ తరహా
సివిల్స్ ఆప్షనల్లో రెండు సెక్షన్లుంటాయి. మొదటి సెక్షన్లో ఒకటో ప్రశ్నలోని ఐదు ఉప ప్రశ్నలు, రెండో సెక్షన్లోని ఐదు ప్రశ్నులకు ఐదు ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. గ్రూప్–1లో కూడా పేపర్ రెండు, మూడు , నాలుగు, ఆరులో కూడా ఆరు ప్రశ్నలు చాయిస్ లేని తప్పనిసరి ప్రశ్నలు. ఈ క్వశ్చన్ పేపర్ విధానాన్ని అనుసరించి అభ్యర్థులు కింది అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి.
1. ప్రతి యూనిట్లోని ప్రతి టాపిక్ను వదలకుండా చదవాలి.
2. నిరంతరం రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
3. ప్రిపరేషన్కు అందుబాటులో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలు అంటే 120 రోజులు. అన్ని రోజుల్లోనూ మూడు గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
4. రైటింగ్ ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్ హాల్లో కదలకుండా మూడు గంటలు పరీక్ష రాయగలరు.
5. కనీసం 1500 నుంచి 1800 ప్రశ్నలకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
ఈ స్థాయి ప్రాక్టీస్తో మాత్రమే ఒక్కో ప్రశ్నకు పది నిమిషాల వ్యవధిలో ఆన్సర్ రాయగలం. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో ఉండగలం.
- పి. కృష్ణ ప్రదీప్
21st సెంచరీ ఐఎఎస్ అకాడమీ