గ్రేటర్ లో తీవ్రమవుతున్న వెహికల్ పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌ సమస్య

గ్రేటర్ లో తీవ్రమవుతున్న వెహికల్ పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌ సమస్య

ప్రతిపాదనలకే పరిమితమైన మల్టీలెవెల్ నిర్మాణాలు 
గ్రేటర్​లో 53 చోట్ల మాత్రమే జీహెచ్ఎంసీ పార్కింగ్ ఏరియాలు
రోజురోజుకు తీవ్రమవుతున్న సమస్య

హైదరాబాద్, వెలుగు : సిటీలో వెహికల్ పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌ సమస్య తీవ్రమవుతోంది. వ్యాపార సముదాయాలు, ఇతర ప్రాంతాల్లో పార్కింగ్‌‌‌‌ స్థలాలు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జీహెచ్‌‌‌‌ఎంసీ పర్మిషన్‌‌‌‌ ఇచ్చిన పార్కింగ్‌‌‌‌ స్థలాలు గ్రేటర్​లో కేవలం 53 మాత్రమే ఉన్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటకు వెళితే వెహికల్​ని పార్క్ చేయడం వాహనదారులకు సవాల్​గా మారుతోంది. రోడ్లుపై నిలిపితే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వెహికల్స్​ను డైరెక్ట్​గా పీఎస్​కు తరలిస్తున్నారు. వాటిని విడిపించుకునేందుకు వాహనదారులు తంటాలు పడుతున్నారు. 

3 వేల ఎకరాల స్థలం అవసరం

2001లో సిటీలో ప్రతి వెయ్యి మందికి 103 వెహికల్స్ ఉండగా, 2011లో ఆ సంఖ్య 279కి పెరిగింది.  ప్రస్తుతం ప్రతి వెయ్యి మందిలో 500 మందికి వెహికల్స్ ఉన్నట్లు పలు సర్వేలు చెప్తున్నాయి. వెహికల్స్ ​పెరగడం, పార్కింగ్​స్థలాల సంఖ్య తక్కువగా ఉండటంతో సమస్య తీవ్రమవుతోంది. ప్రస్తుతం పార్కింగ్ సమస్య తీరేందుకు దాదాపు 3 వేల ఎకరాల స్థలం అవసరమని ఎక్స్ పర్ట్స్​ అంటున్నారు. కమర్షియల్​ కారిడార్ల సంఖ్యను పెంచుతున్న జీహెచ్ఎంసీ పార్కింగ్ ​సదుపాయం కల్పించడంపై దృష్టిపెట్టకపోతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. చార్మినార్, ఎల్​బీనగర్, కోఠి, సికింద్రాబాద్,  కూకట్​పల్లి, కేపీహెచ్​బీ, రాణిగంజ్, ఉస్మాన్​గంజ్, బేగంబజార్​ ఇలా ఎక్కడ చూసినా పార్కింగ్​ కోసం కష్టాలు తప్పడం లేదు.

మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్​ల ఊసే లేదు

పార్కింగ్ తో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్ నర్​షిప్) పద్ధతిలో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్​లను నిర్మించాలని కొన్నేళ్లుగా అధికారులు చెబుతూనే ఉన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 42 ప్రాంతాల్లో పార్కింగ్ కాంప్లెక్స్​ల నిర్మాణానికి భూములను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో ఆయా శాఖలు తమ అవసరాలతో పాటు వాణిజ్య, పార్కింగ్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు ఇవ్వాలని 2018 జూన్​లో మున్సిపల్​ శాఖ ప్రిన్సిపల్​ సెక్ర
టరీ అర్వింద్​కుమార్ ఆదేశించారు. ప్రతి పార్కింగ్ కాంప్లెక్స్​ను యూనిట్​గా అభివృద్ధి చేయాలని, వాణిజ్య అంశాలను దృష్టిలో ఉంచుకొని, ప్యాకేజీల వారీగా ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించినా నేటికీ కాంప్లెక్స్​ల నిర్మాణం జరగలేదు. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేట్​భూములను తీసుకొని నిర్మిస్తామని చెప్పిన్నప్పటికీ ఆ విషయంపై దృష్టిపెట్టడం లేదు. ఇదే విషయంపై 2021 జనవరిలో కమిషనర్​లోకేశ్​కుమార్ ​సైతం సమావేశం నిర్వహించారు. తొందరలోనే మల్టీలెవెల్ పార్కింగ్​ కాంప్లెక్స్​ల నిర్మాణాలు ప్రారంభిస్తామన్నప్పటికీ పనులు మాత్రం స్టార్ట్ కాలేదు.

ఆదాయంపైనే ఫోకస్

కమర్షియల్​ కారిడార్లపై వస్తున్న ఆదాయంపై మాత్రమే ఫోకస్ పెట్టిన బల్దియా.. అక్కడ సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతోంది. గ్రేటర్​లో కమర్షియల్ ​రోడ్లు ఉన్న ప్రాంతాల్లో నిర్మాణ పర్మిషన్లు, వ్యాపార సముదాయలకు తీసుకునే పర్మిషన్ ఫీజులు సైతం పెరిగాయి. ట్యాక్స్​లు చెల్లించని వారికి నోటీసులు సైతం జారీ చేస్తున్నారు.  కానీ షాపింగ్​కు వచ్చేవారికి పార్కింగ్ ​స్థలం కేటాయించకపోవడంతో రోడ్లపైనే వెహికల్స్​ను పెట్టి వెళ్తున్నారు. బల్దియా అన్ని పన్నులు వసూల్​చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై వ్యాపారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఫిర్యాదు చేయండి ఇలా..

అక్రమంగా పార్కింగ్​ ఫీజు వసూల్ చేస్తే ..పార్కింగ్ బిల్లుతో బల్దియా ఎన్​ఫోర్స్​మెంట్ వింగ్ ట్విట్టర్​కి లేదా సర్కిల్ఆఫీసులోని డిప్యూటీ కమిషనర్​కు కంప్లయింట్ చేయొచ్చు .రూల్స్ బ్రేక్ చేసిన వారికి రూ.50వేల ఫైన్ విధించే అవకాశం ఉంది. హెల్ప్​లైన్ నం. 040–21111111కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 

జీవోకు విరుద్ధంగా వసూళ్లు

పార్కింగ్​కు సంబంధించి ప్రభుత్వం 2018లో జీవో నంబర్ 68ని జారీ చేసింది. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మాల్స్, హాస్పిటల్స్, కమర్షియల్​ కాంప్లెక్స్ లలో ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్​ ఫీజు వసూల్​ చేయొద్దనే రూల్ ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా పార్కింగ్​ ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో ఫోర్ వీలర్​ను 3 గంటల పాటు ఉంచితే రూ.50, టూ వీలర్​కి 5 గంటల లోపు రూ.30 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత గంటకి రూ.10 చొప్పున అధికంగా కలెక్ట్​ చేస్తున్నారు. మెట్రో రైల్, బస్టాప్, రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేయాలనే దానిపై జీవోలో క్లారిటీ లేకపోవడంతో.. ఇదే అదునుగా ఈ ప్రాంతాల్లో అడ్డగోలుగా పార్కింగ్​ ఫీజులు వసూలు​ చేస్తున్నారు.  

పార్కింగ్ ఫీజు లేకుండా చూడాలి

నిమ్స్​లో  పార్కింగ్ ఫీజు కట్టాల్సి వస్తోంది. బైక్​కు ప్రతి12 గంటలకు రూ.20 చెల్లించాల్సి వస్తోంది. ఫీజు కట్టకపోతే బయట పెట్టుకోవాలని చెప్తున్నరు. హాస్పిటల్​లో బిల్లులు కట్టిన ప్పుడు పార్కింగ్ ఫీజు ఎందుకు కట్టాలి. పార్కింగ్ ​ఫీజు లేకుండా చూడాలి.

‑ రాఘవేందర్, పేషెంట్ అటెండర్

పార్కింగ్ లేక రోడ్డుపై పెడుతున్నం

వస్తువులు కొందామని బేగంబజార్​కి వస్తే వెహికల్ ఎక్కడ పెట్టాలో అర్థం కావడం లేదు. 30 నిమిషాల షాపింగ్ చేసేందుకు వస్తే పార్కింగ్ ​కోసం వెతికేందుకే అంతకుమించి టైమ్ పడుతోంది. జాగా లేకపోవడంతో రోడ్డు పక్కనే పెట్టాల్సి వస్తోంది.

‑ సంతోష్ రెడ్డి, వాహనదారుడు