ఫేకో.. కాదో తేలుస్తున్నరు
కరోనా తర్వాత హైర్ చేస్కున్న ఎంప్లాయ్స్ పై ఐటీ కంపెనీల ఫోకస్
హైదరాబాద్, వెలుగు : ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎప్పుడూ పోటీ ఉంటుంది. జాబ్ వస్తే ప్యాకేజీలు లక్షల్లో ఉంటాయి. ఈ క్రమంలోనే ఐటీ ఎంప్లాయ్గా సెటిల్అవ్వాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. కరోనాకు ముందు ఇంటర్వ్యూలన్నీ ఆఫీసుల్లో ఫిజికల్ గా జరిగేవి. లాక్డౌన్పెట్టాక వర్క్ఫ్రమ్ హోమ్ చేసే వెసులుబాటు ఇవ్వడంతో అంతా ఇండ్ల నుంచి పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని కంపెనీలు తమకు కావాల్సిన మ్యాన్ పవర్ను వర్చువల్గానే రిక్రూట్చేసుకుంటున్నాయి. ఇదే అదునుగా వేల మంది బ్యాక్డోర్, ఫేక్సర్టిఫికెట్లు, ఫేక్ఎక్స్పీరియన్స్ తో జాబ్స్పొందారు.
డిగ్రీలు, వర్కింగ్ఎక్స్పీరియన్స్లేకుండానే తెలిసిన వాళ్ల ద్వారా ఇంటర్వ్యూలు చేయించుకుని ఏదోక కంపెనీల్లో దూరిపోయారు. ఎలాగో వర్క్ఫ్రమ్హోమ్ నడుస్తుండడంతో అప్పటికే ఆ డొమైన్పై పనిచేస్తున్నవారికి శాలరీలో కొంత ఇచ్చి మేనేజ్చేస్తున్నారు. బ్యాక్ డోర్ నుంచి కూడా ఎక్కువ మందే జాయిన్అయ్యారు. ఇప్పుడిప్పుడే కంపెనీలు పూర్తిస్థాయిలో ఓపెన్అవుతున్నాయి. ఫేక్వ్యవహారాన్ని ఆలస్యంగా గుర్తించిన మేనేజ్మెంట్లు కరోనా తర్వాత చేరిన వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. థర్డ్ పార్టీ కంపెనీలతో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయిస్తున్నాయి. ఫేక్అని తేలితే ఉన్న పళంగా తొలగిస్తున్నాయి. ఇప్పటికే ఇలా చాలా మంది జాబ్స్ కోల్పోయారు.
విపరీతంగా హైర్ చేసుకున్నరు
లాక్ డౌన్ తర్వాత ఐటీ కంపెనీలకు అధిక సంఖ్యలో ప్రాజెక్టులు వచ్చాయి. ఈ క్రమంలో విపరీతంగా ఎంప్లాయ్స్ను హైర్ చేసుకున్నాయి. ఇదే అదునుగా కొందరు కన్సల్టెన్సీల ద్వారా జాబ్స్ పొందారు. వందలాది మంది ప్రాక్సీ(ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయ్ఆన్సర్లు చెబుతుండగా, క్యాండిడేట్ వర్చువల్గా స్క్రీన్ ముందు కూర్చుని తల ఊపుతూ చెబుతున్నట్లు నటించడం) ద్వారా ఐటీ కంపెనీల్లో దూరిపోయారు. ఇంటర్వ్యూ అయిపోయాక సెలక్ట్అయితే, చేసిన పెట్టిన వ్యక్తికి క్యాండిడేట్ఒకట్రొండు నెలల శాలరీ ఇచ్చారు. మరోవైపు కన్సల్టెన్సీలు, హెచ్ఆర్లు టైఅప్ అయి క్యాండిడేట్లను హైర్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి వారందరినీ మేనేజ్మెంట్లు గుర్తించే పనిలో పడ్డాయి. ప్రతిఒక్కరి బ్యాక్ గ్రౌండ్ను వెరిఫై చేయిస్తున్నాయి. ఎంప్లాయ్ఎడ్యుకేషన్, గతంలో పని చేసినట్లు పెట్టిన ఎక్స్పీరియన్స్నిజమా, కాదా అని క్రాస్ చెక్ చేయిస్తున్నాయి. కొన్ని కంపెనీలైతే 2, 3 పద్ధతుల్లో ఈ ప్రాసెస్ను కొనసాగిస్తున్నాయి.
నోటీస్ పీరియడ్ ఇచ్చి టర్మినేట్
కొన్నిరోజుల నుంచి బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్కు సంబంధించిన ఇష్యూ నడుస్తోంది. మా టీం లీడర్, మేనేజర్ల ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. మేనేజ్మెంట్కు ఏ మాత్రం డౌట్ వచ్చినా వెంటనే నోటీస్ పీరియడ్ ఇష్యూ చేసి టర్మినేట్ చేసేస్తున్నారు.
- మమత, ఐటీ ఎంప్లాయ్, ఉప్పల్
కొంత మందిని తీసేశారు
ఫ్రెషర్లతో పాటు సీనియర్ల గురించి కూడా తెలుసుకుంటున్నారు. మా టీంలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతమందిని టర్మినేట్ చేశారని తెలిసింది. బ్యాక్ డోర్ నుంచి వచ్చినవారే కాకుండా ప్రస్తుతం ఎంప్లాయ్స్అందరూ భయంతో ఉన్నారు.
- అర్జున్, ఐటీ ఎంప్లాయ్, కొండాపూర్
ఇప్పుడిదే హాట్ టాపిక్
ఐటీ సెక్టార్లో ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ హాట్ టాపిక్గా మారింది. ఫేక్ క్యాండిడేట్లు గతంలో 6 శాతం ఉంటే ఇప్పుడు 10 శాతానికి పైగా ఉన్నారని ఐటీ కంపెనీల్లోని సీనియర్ ఎంప్లాయ్స్ చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో వర్క్ లేకపోవడం, ప్రాజెక్టులు ఇన్ టైంలో కంప్లీట్ కాకపోతుండడం ఫేక్ ఎంప్లాయ్స్పెరిగిపోవడానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే కాగ్నిజెంట్, విప్రో, డెలాయిట్ వంటి ఎంఎన్సీలు ఎంప్లాయ్స్ రియలా? ఫేకా? తెలుసుకునే పనిలో పడ్డాయి. సోషల్మీడియాలోనూ దీనికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫేక్ సర్టిఫికెట్లు, బ్యాక్డోర్ద్వారా జాబ్పొందిన వారందరూ ఆందోళనలో ఉన్నారు. మరోవైపు దొరికిన వారికి హెల్ప్ చేసిన హెచ్ఆర్లు, ఇతర ఎంప్లాయీస్ను మేనేజ్మెంట్లు ఫైర్ చేస్తున్నాయి.