ఒకే రూమ్ లో హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదిక్​ హాస్పిటల్స్

ఒకే రూమ్ లో హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదిక్​ హాస్పిటల్స్

కామారెడ్డి, వెలుగు: జిల్లాలో  ప్రభుత్వ సంప్రదాయ వైద్య ఆస్పత్రులకు బిల్డింగ్స్​కరువయ్యాయి.  కామారెడ్డిలో హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదిక్​ హాస్పిటల్స్ మూడింటిని ఒకే రూమ్​లో ఏర్పాటు చేశారు. దేశీయ వైద్యం చేయించుకోవడానికి కూడా చాలా మంది పేషంట్లు వస్తుండడంతో   ఇబ్బందులు పడుతున్నారు.  ఉన్నతాధికారులు ఫోకస్​పెట్టి మూడు సంప్రదాయ వైద్యాలకు వేర్వేరుగా బిల్డింగ్స్​నిర్మించాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.