
- నల్గొండ జిల్లా వంగమర్తిలో ఘటన
శాలిగౌరారం (నకిరేకల్), వెలుగు : బిడ్డతో కలిసి బావిలో దూకి తల్లి చనిపోయిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. పోలీసుల తెలిపిన ప్రకారం.. శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన సింగారపు వాణి(25)తో రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన మహేశ్తో పెండ్లి అయింది. వాణికి డెలివరీ సమయంలో అనారోగ్య సమస్యలు వచ్చాయి.
అప్పటి నుంచి ఆమె మానసిక పరిస్థితి సరిగాలేదు. గతంలో వాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెనుతల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. కాగా.. వాణి తన 8 నెలల పాపతో కలిసి శనివారం ఉదయం బావిలో దూకింది. మధ్యాహ్నం తల్లిదండ్రులు గుర్తించి వాణి డెడ్ బాడీని వెలికితీశారు. రాత్రి వరకు పాప కోసం గాలించినా ఆచూకీ దొరకలేదని పోలీసులు తెలిపారు.