సెప్టెంబర్ 18న డీఎస్సీ డీటెయిల్డ్ నోటిఫికేషన్.. 20 నుంచి అక్టోబర్ 21 వరకూ దరఖాస్తులు

సెప్టెంబర్ 18న  డీఎస్సీ డీటెయిల్డ్ నోటిఫికేషన్..  20 నుంచి అక్టోబర్ 21 వరకూ దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న 5,089 టీచర్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను సోమవారం రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఈ నెల15న జిల్లాలవారీగా సబ్జెక్టులు, మీడియం పోస్టుల ఖాళీల వివరాలతో పాటు రోస్టర్ డీటెయిల్స్ వెల్లడిస్తామని డీఎస్సీ నోటిఫికేషన్ లో సర్కారు ప్రకటించింది. 

Also Rard:బీఆర్ఎస్ నేతలు.. చవటలు.. దద్దమ్మలు: బండి సంజయ్

కానీ రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో అధికారులు బిజీగా ఉండటం, విద్యాశాఖ, స్కూల్ ఎడ్యుకేషన్​ఉన్నతాధికారులు సెలవులో ఉండటంతో డీఎస్సీ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇష్యూ ఆలస్యమైంది. 

అయితే, సోమవారం డీటెయిల్డ్ నోటిఫికేషన్​ను www.schooledu.telangana.gov.in   వెబ్ సైట్​లో పెడ్తామని అధికారులు వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను ఈ నెల 20న అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకూ ఆన్​లైన్​లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.