ఒడిశాలో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి 

ఒడిశాలో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి 

భద్రాచలం, వెలుగు: ఒడిశా రాష్ట్రంలో మంగళవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. కందమాల్​ జిల్లాలోని బలిగూడ పోలీస్​స్టేషన్  పరిధిలోని సుక్లాడ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న ఒడిశాకు చెందిన డీవీఎఫ్​ బలగాలు సోమవారం రాత్రి నుంచి కూంబింగ్​ చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరగ్గా, మావోయిస్టులు పారిపోయారు.

ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నారు. కేకేబీఎన్​ డివిజన్​కు చెందిన ఏరియా కమిటీ మెంబర్​ మంకు అలియాస్​ రాహుల్, సభ్యుడు చందన్​గా గుర్తించారు. 303 రైఫిల్, పిస్టల్, ఇతర పేలుడు పదార్ధాలు, నిత్యావసర సరుకులు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్​ కొనసాగుతోంది.