న్యూఢిల్లీ: కరోనా వైరస్పై అవగాహన కల్పించేందుకు మ్యూజిక్ను వాడుకుంటోంది యూఏఈకి చెందిన ఇండియన్ సంతతి అమ్మాయి. 14 ఏండ్ల సుచేతా సతీష్.. అరబిక్, తెలుగు, మలయాళం సహా 20కిపైగా భాషల్లో సాంగ్స్ రికార్డ్ చేసింది. ఫిజికల్ డిస్టెన్స్, క్లీన్లీనెస్ పాటించాలని, తరచు చేతులు కడుక్కోవాలంటూ తన పాటల ద్వారా జనంలో అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ‘‘సే నో టు పానిక్” పేరుతో మార్చి 16న ఇంగ్లిష్లో తొలి కరోనా వైరస్ అవేర్నెస్ సాంగ్ను రిలీజ్ చేసింది. ఆ తర్వాత మలయాళం, బెంగాలీ, అరబిక్, కన్నడ, తుళు, కొంకణి, మరాఠి, గుజరాతీ, రాజస్థానీ, సింధి, హిమాచలి, ఒడియా, మణిపూరి, నేపాలి, ఉర్దు, పంజాబీ, భోజ్పూరి, హిందీ, అస్సామీ, తమిళ్, తెలుగు, సంస్కృతం, కాశ్మీరీ భాషల్లోనూ పాటలు పాడింది. మలయాళం, హిందీ, బెంగాలీ, తమిళ్, అస్సామీలో సుచేత పాడిన పాటలను కేరళ ప్రభుత్వం.. తన బ్రేక్ ద చైన్ క్యాంపెయిన్ కోసం వాడుకుంది.
భావాలు చెప్పడానికి మ్యూజిక్కే బెస్ట్
కేరళకు చెందిన సుచేత దుబాయ్ ఇండియన్ హై స్కూల్లో టెన్త్ చదువుతోంది. ఒక కన్సర్ట్లో ఎక్కువ లాంగ్వేజెస్లో పాటలు పాడిన వరల్డ్ రికార్డు సుచేత పేరిటే ఉంది. లాంగెస్ట్ లైవ్ కన్సర్ట్ చేసిన చిన్నారిగానూ ప్రపంచ రికార్డు ఆమె సొంతం. తనను తాను కరోనా వారియర్గా భావిస్తున్న ఆమె ‘‘మ్యూజిక్ అనేది సమర్థవంతంగా నా భావాలు వ్యక్తీకరించే లాంగ్వేజ్. మా అమ్మ సుస్మిత సాయంతో ఈ పాట రాసుకుని, నేనే కంపోజ్ చేశా. ఈ వీడియో ఎడిటింగ్లో మా అమ్మ హెల్ప్ చేసింది. సరైన సమాచారం ఇవ్వడానికి మా నాన్న నుంచి ఇన్పుట్స్ తీసుకున్నా. ఆ తర్వాతే పాట రెడీ చేశా. నా హోం స్టూడియోలోనే రికార్డింగ్ కంప్లీట్ చేశాను” అని చెప్పింది. మొదట కరోనా పాటలన్నీ మలయాళంలో రికార్డు చేశానని, వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో మిగతా ఇండియన్ లాంగ్వేజెస్లోనూ పాటలు పాడానని తెలిపింది.