వెలుగు బిజినెస్ డెస్క్: ఊర్లలో సైతం యూపీఐ పేమెంట్లు జోరందుకున్నాయి. రూరల్ ఏరియాలలోని ప్రజలు కూడా లోకల్గా ఉండే కిరాణా, మెడికల్, మొబైల్ రీఛార్జ్ షాపులు, ట్రావెల్ ఏజంట్లు, కస్టమర్ సర్వీస్ పాయింట్లు (సీఎస్పీ)ల సాయంతో డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. నగదు విత్డ్రాయల్, ఎంఎస్ఎంఈ క్రెడిట్, యుటిలిటీ పేమెంట్లు, ఈ–కామర్స్ వంటి వాటి కోసం డిజిటల్ లావాదేవీలనే వారు నిర్వహిస్తున్నట్లు పేనియర్బై సర్వేలో తేలింది. దీంతో సెమి అర్బన్ ఏరియాలలో 25 శాతం, రూరల్ ఏరియాలలో 14 శాతం అసిస్టెడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు పెరిగినట్లు ఈ సర్వే వెల్లడించింది. తమ బ్యాంకింగ్, లైఫ్స్టైల్ అవసరాలకు డిజిటల్ పద్ధతులనే అలవాటు చేసుకోవడం ద్వారా వారు ఫార్మల్ ఎకానమీలో భాగమవుతున్నట్లు ఈ సర్వే పేర్కొంది.
650 శాతం గ్రోత్
రూరల్ ఏరియాలలోని తమ రిటెయిల్ కౌంటర్లలో యూపీఐ ట్రాన్సాక్షన్లు ఏకంగా 650 శాతం పెరిగినట్లు పేనియర్బై తెలిపింది. డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో యూపీఐ కీలకపాత్ర పోషించగలదనే విషయం దీంతో స్పష్టమవుతోందని పేర్కొంది. రిటెయిల్ఓ నోమిక్స్ పేరిట ఒక రిపోర్టును పేనియర్బై విడుదల చేసింది. దేశంలోని 10 లక్షల రిటెయిల్టచ్పాయింట్ల నుంచి సేకరించిన సమాచారంతో ఈ రిపోర్టును రూపొందించినట్లు పేనియర్బై వివరించింది. జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 మధ్య కాలానికి సంబంధించిన డేటాను సేకరించినట్లు పేర్కొంది.
నగదు కోసం మైక్రో ఏటీఎంలు...
నగదు విత్డ్రాయల్స్ కోసం రూరల్, సెమి అర్బన్ ఏరియాలలోని ప్రజలు ప్రధానంగా మైక్రో ఏటీఎంలపైనే ఆధారపడుతున్నారు. దీంతో వాటి వాల్యూ, వాల్యూమ్ రెండూ పెరిగినట్లు పేనియర్బై వెల్లడించింది. ఈ మైక్రో ఏటీఎంల ద్వారా నగదు విత్డ్రాయల్స్ విలువ రీత్యా 25 శాతం గ్రోత్ సాధించినట్లు పేర్కొంది. క్యాష్ కలెక్షన్ బిజినెస్ (ఈఎంఐల వంటివి) కూడా రూరల్, సెమి అర్బన్ ఏరియాలలో 200 శాతం పెరిగి నెలకు రూ. 1,400 కోట్లకు చేరినట్లు పేనియర్బై సర్వే రిపోర్టు వివరించింది. ఈ–కామర్స్ కంపెనీల లావాదేవీలతోపాటు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల వంటివీ రూరల్ ఏరియాలలోని ప్రజలు డిజిటల్గా జరుపుతున్నారని పేర్కొంది. అసిస్టెడ్ కామర్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్, మైక్రో–లెండింగ్ వంటి వాటి వల్ల రూరల్ ఏరియాలు సైతం డిజిటల్ చెల్లింపులలో దూసుకెళ్తున్నాయని పేనియర్బై ఎండీ ఆనంద్ కుమార్ బజాజ్ చెప్పారు. ఈ ఏడాది మొదటి 10 నెలల్లో రూ. 70 వేల కోట్ల విలువైన డిజిటల్ సర్వీసులను తాము నిర్వహించినట్లు పేర్కొన్నారు. రూరల్ ఏరియాలలో వాడకానికి అనువుగా టెక్నాలజీలను మరింత ఈజీ చేయడంపై తాము ఫోకస్ పెడుతున్నామని బజాజ్ అన్నారు.
నాన్ బ్యాంకింగ్ టైములోనే ఎక్కువ...
బ్యాంకులు సాధారణంగా పనిచేయని టైముల్లోనే రూరల్ ఏరియాలలో ఎక్కువగా అంటే 32 శాతం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు (సాయంత్రం 6 నుంచి రాత్రి 12) జరుగుతున్నట్లు కూడా పేనియర్బై సర్వేలో తేలడం ఇంకొక విశేషం.