ఇండియాను కాట్సా కిందికి తేవొద్దు

ఇండియాను కాట్సా కిందికి తేవొద్దు

వాషింగ్టన్: రష్యా నుంచి ఎస్​400 ట్రయంప్​మిసైళ్లను కొంటున్న ఇండియాపై ‘కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్​(కాట్సా)’ ఆంక్షలు విధించొద్దని ఇద్దరు పవర్​ఫుల్​అమెరికా సెనెటర్లు ఆ దేశ ప్రెసిడెంట్ జో బైడెన్​ను కోరారు. నేషనల్ ఇంట్రస్ట్​ను దృష్టిలో పెట్టుకొని ఇండియాకు మినహాయింపునివ్వాలని డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనెటర్​ మార్క్ వార్నర్, రిపబ్లికన్​ పార్టీకి చెందిన సెనెటర్ జాన్ కొర్నిన్ మంగళవారం ప్రెసిడెంట్​కు లెటర్ ​రాశారు.​​ ‘ఎస్​400 మిసైళ్లు కొనేందుకు 2018లో రష్యాతో ఇండియా ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించి అంతకు రెండేళ్ల ముందే సంతకాలు చేసింది. అయితే ఆ మిసైళ్లను గనక ఇండియా కొంటే కాట్సా శాంక్షన్​ను అమెరికా​అమలు చేసే అవకాశం ఉంది. ఆ చట్టం అమలు చేస్తే ఇండియాతో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రభావం పడుతుంది. పైగా రష్యా ఆయుధాలు కొనకుండా ఆపాలన్న లక్ష్యం కూడా నెరవేరదు’ అని సెనెటర్లు లెటర్​లో వివరించారు.

అమెరికాకూ నష్టమే

రష్యా నుంచి ఆయుధాలు కొనడాన్ని ఇండియా క్రమంగా తగ్గిస్తూ వస్తోందన్నారు. 2016 నుంచి 2020 కాలంలో రష్యా నుంచి ఆయుధాల కొను గోలు 53% తగ్గిందన్నారు. అలాగే అమెరికా నుంచి ఆయుధాలను ఇండియా ఎక్కువగా కొంటోందని, 2020 ఆర్థిక సంవత్సరంలో ఆయుధాల కొనుగోలు రూ.25 వేల కోట్లకు చేరుకుందని తెలిపారు. పైగా వ్యాక్సిన్లు, డిఫెన్స్​లో సహకారం, ఎనర్జీ స్ట్రాటజీ, టెక్నాలజీ మార్పిడి వంటి విషయాల్లో అమెరికాతో ఇండియా కలిసి నడుస్తోందని.. ఇలాంటి టైమ్​లో ఆంక్షలు విధిస్తే సమస్యలు వస్తాయని చెప్పారు. ఇండో పసిఫిక్​లో చైనాను ఎదుర్కోవడానికి కూడా ఇండియా సాయం ఎంతో ముఖ్యమని గుర్తుచేశారు. 2019లో చేసిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ ప్రకారం నేషనల్ ఇంట్రస్ట్​ను దృష్టిలో పెట్టుకొని ప్రెసిడెంట్ కాట్సా శాంక్షన్స్ నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని వార్నర్, కొర్నిన్​చెప్పారు.

ఎందుకీ కాట్సా?

రష్యాకు చెందిన అత్యాధునిక సర్ఫేస్ టు ఎయిర్​ మిసైల్​ డిఫెన్స్​ సిస్టమ్​ఎస్​400లను 5 యూనిట్లు కొనేందుకు రూ.37 వేల కోట్లకు 2018​లో ఇండియా ఒప్పందం చేసుకుంది. ఆ మిసైళ్లు కొంటే కాట్సా శాంక్షన్ విధిస్తామని  ఇండియాను అప్పటి అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్ హెచ్చరించారు. రష్యా నుంచి ఎవరైనా ప్రధాన రక్షణ హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్​ను కొంటే ఆంక్షలు విధించేలా అమెరికా 
కాట్సా చట్టం చేసింది.