కరోనాతో చనిపోయిండు.. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిండు

కరోనాతో చనిపోయిండు.. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిండు

నార్త్‌‌ డకోటా (యూఎస్‌‌): నెల రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి.. మంగళవారం అనౌన్స్‌‌ చేసిన రిజల్ట్స్‌‌లో విజయం సాధించాడు. అమెరికా నార్త్‌‌ డకోటాకు చెందిన రిపబ్లికన్‌‌ కేండిడేట్‌‌ డేవిడ్‌‌ అందల్‌‌ అక్టోబర్‌‌‌‌ 5న కరోనాతో మరణించాడు. అయితే, ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్స్‌‌లో మాత్రం గెలిచారు. నార్త్‌‌ డకోటాలోని బిస్‌‌మార్క్‌‌లో రిపబ్లికన్‌‌ పార్టీ తరఫున డేవిడ్‌‌ అందల్‌‌, డేవ్‌‌ నెహరింగ్‌‌ బరిలో నిలిచారు. వైరస్‌‌ సోకడంతో హాస్పిటల్‌‌లో చేరిన అందల్‌‌ నాలుగు రోజులు ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకున్న తరువాత చనిపోయాడు. అందల్‌‌ చాలా జాగ్రత్తగా ఉండేవాడని, ఎలక్షన్స్‌‌లో గెలవాలని ఆతృతగా ఎదురుచూశాడని ఆయన తల్లి పాట్‌‌ అందల్‌‌ చెప్పారు. రైతులు, బొగ్గు పరిశ్రమను డెవలప్‌‌ చేయాలని అనుకునేవాడని అన్నారు.