మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి

మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి

నటుడు వరుణ్‌  తేజ్‌, లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఓ ఇంటివారయ్యారు.  ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం (నవంబర్ 1న) రాత్రి 7.18 గంటలకు వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్‌ తేజ్ మూడుముళ్లు వేశారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌...హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు

కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన అగ్ర, యువ హీరోలందరూ షూటింగ్స్‌ నుంచి బ్రేక్స్‌ తీసుకుని పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, నీరజా కోన ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. 

2017లో ‘మిస్టర్‌’ సినిమా కోసం వరుణ్‌, లావణ్య తొలిసారి కలిసి నటించారు. అప్పుడే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ మరుసటి ఏడాది వచ్చిన ‘అంతరిక్షం’లోనూ ఈ జంట కలిసి నటించింది. ఈ ఏడాది కాలంలో ఇద్దరి మధ్య స్నేహం  ప్రేమగా మారింది.