- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
కొడిమ్యాల, వెలుగు: పరపతి ఉంది కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి అప్పులు పుడుతున్నాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ చెప్పారు. ఆదివారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పాల్గొన్నారు. శనివారం పేట విలేజ్ లో జీపీ బిల్డింగును, హిమ్మత్ రావు పేటలో రూ. 80 లక్షలతో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు.
ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. వడ్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని అన్నారు. కేవలం కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల కోసం మాత్రమే అప్పులు తెచ్చినట్లు తెలిపారు. జడ్పీటీసీ ప్రశాంతి, కృష్ణారావు, రాజనర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.