పరపతి ఉంది కాబట్టే అప్పులు పుడ్తున్నయ్​

పరపతి ఉంది కాబట్టే అప్పులు పుడ్తున్నయ్​
  • ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్  

కొడిమ్యాల, వెలుగు:  పరపతి ఉంది కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి అప్పులు పుడుతున్నాయని  ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్  చెప్పారు. ఆదివారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జడ్పీ చైర్​పర్సన్​ దావ వసంతతో కలిసి పాల్గొన్నారు. శనివారం పేట విలేజ్ లో జీపీ బిల్డింగును,  హిమ్మత్ రావు పేటలో రూ. 80 లక్షలతో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ప్రారంభించారు.  అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు.  

ప్రెస్​మీట్​లో మాట్లాడుతూ..  వడ్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని అన్నారు.  కేవలం కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల కోసం మాత్రమే అప్పులు తెచ్చినట్లు తెలిపారు. జడ్పీటీసీ ప్రశాంతి, కృష్ణారావు, రాజనర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.