Cricket World Cup 2023: ఫ్యాన్ కోసం దిగొచ్చిన విరాట్ కోహ్లీ..కింగ్‌పై నెటిజన్స్ ప్రశంసలు

Cricket World Cup 2023: ఫ్యాన్ కోసం దిగొచ్చిన విరాట్ కోహ్లీ..కింగ్‌పై నెటిజన్స్ ప్రశంసలు

టీమిండియా స్టార్ క్రికెటర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచుకు ముందు శ్రీనివాస్ అనే అభిమానిని కలిసి ఆప్యాయంగా పలకిరించాడు. శ్రీనివాస్ అంగవైకల్యం కావడంతో విరాట్ స్వయంగా అతడి దగ్గరికి వెళ్లడం విశేషం. ఈ సందర్భంగా శ్రీనివాస్.. కోహ్లీకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. హ్యాండ్‌మేడ్ పోర్ట్రెయిట్‌ను తయారు చేయబడిన ఈ పెయింటింగ్  చాలా బాగుంది. దీనిని గీయడానికి తనకు 40 గంటలు పట్టిందని చెప్పాడు. 

కోహ్లీని కలవడంతో తన జన్మ ధన్యమైందని, ఇదంతా ఒక కలలా అనిపించిందని తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. శ్రీనివాస్ గ్రాఫిక్ డిజైన్ చదువుతున్నాడు. వరల్డ్ కప్ మ్యాచ్ చూసేందుకు టికెట్లు కొనడానికి ఇక్కడికి వచ్చాడు. కానీ ఇక్కడ కోహ్లీని కలుసుకోవడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కోహ్లీ ఇలా ఫ్యాన్ ని  ప్రత్యేకంగా కలుసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు అభిమానులను కలుసుకొని సర్ ప్రైజ్ చేసాడు. దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  

కాగా.. భారత్-ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 8 న వరల్డ్ కప్ లో తమ తొలి మ్యాచ్ ఆడబోతున్నారు. చెన్నైలోని చిదంబరం స్టేడియం ఈ మ్యాచుకు ఆతిధ్యమిస్తుంది. ఇప్పటికే ఇరు జట్లు ఈ మ్యాచ్ ఆడేందుకు చెన్నై చేరుకున్నాయి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఈ మ్యాచ్ హోరా హోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది.