కంటోన్మెంట్, వెలుగు: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘విజిటర్స్ఫెసిలిటీ సెంటర్’ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. అక్కడి గార్డెన్లో పచ్చని మొక్కలతో రూపొందించిన గడియారాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రపతి నిలయం గొప్ప వారసత్వ సంపద అన్నారు. ఇక్కడి ప్రాధాన్యాన్ని ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో సందర్శనకు అనుమతి ఇచ్చారని తెలిపారు.
అనంతరం రాష్ట్రపతి నిలయం సందర్శకులకు అందుబాటులోకి వచ్చి యేడాది పూర్తయిన సందర్భంగా ‘యాన్యువల్క్రానికల్స్ఆఫ్రాష్ట్రపతి నిలయం– ఏ ఇయర్విత్ ప్రెసిడెంట్ద్రౌపది ముర్ము’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. వీకెండ్స్లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తామని రాష్ట్రపతి నిలయం సెక్రటరీ రాజేశ్ వర్మ చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా 8న హెరిటేజ్సారీ వాక్, లిటరరీ ఫెస్టివల్నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్కలెక్టర్ అనుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
