
మెదక్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ వ్యవహరించారు. ఆమె స్థానంలో వివేక్ వెంకట స్వామి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాలను ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి సమీక్షిస్తారు.
మంత్రి వివేక్ను సన్మానించిన చెరుకు శ్రీనివాస్రెడ్డి
దుబ్బాక: వివేక్ వెంకటస్వామికి మైనింగ్ కార్మిక మంత్రి పదవి రావడం సంతోషకరమని ప్రజాపాలనలో సామాజిక న్యాయాన్ని పాటించడం రేవంత్రెడ్డి సర్కార్కే సాధ్యమని కాంగ్రెస్దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని సోమాజిగూడలో మంత్రి వివేక్ను కలిసి శాలువాతో సన్మానించారు. పేద వర్గాల పెన్నిధిఅయిన కాకా బాటలో నడుస్తున్న వివేక్కు మంత్రి పదవి రావడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.