ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వివేక్ వెంకట స్వామి

ఉమ్మడి మెదక్ జిల్లా  ఇన్చార్జి మంత్రిగా వివేక్ వెంకట స్వామి

మెదక్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రిగా రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రిగా రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ వ్యవహరించారు. ఆమె స్థానంలో వివేక్ వెంకట స్వామి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాలను ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి సమీక్షిస్తారు.

మంత్రి వివేక్​ను సన్మానించిన చెరుకు శ్రీనివాస్​రెడ్డి

దుబ్బాక: వివేక్​ వెంకటస్వామికి మైనింగ్​ కార్మిక మంత్రి పదవి రావడం సంతోషకరమని ప్రజాపాలనలో సామాజిక న్యాయాన్ని పాటించడం రేవంత్​రెడ్డి సర్కార్​కే సాధ్యమని కాంగ్రెస్​దుబ్బాక నియోజకవర్గ ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్​రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్​లోని సోమాజిగూడలో మంత్రి వివేక్​ను కలిసి శాలువాతో సన్మానించారు. పేద వర్గాల పెన్నిధిఅయిన కాకా బాటలో నడుస్తున్న వివేక్​కు మంత్రి పదవి రావడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.