వనపర్తి, వెలుగు: గ్రామపంచాయతీ నామినేషన్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా నిర్వహించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం గోపాల్పేట మండలంలోని తాడిపర్తి, బుద్ధారం, పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి, వీరాయిపల్లి గ్రామపంచాయతీల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
వీరాయపల్లిలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ మల్లయ్య బట్టు, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ యాదయ్యతో కలిసి నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ప్రతి రోజు నామినేషన్ల స్వీకరణ అనంతరం సాయంత్రం టీ పోల్ యాప్ లో అప్డేట్ చేయాలని సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు ఒక ప్రపోజర్ మరో వ్యక్తిని మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించాలని సూచించారు. గోపాల్పేట, పెద్దమందడి తహసీల్దార్లు తిలక్ రెడ్డి, పాండు నాయక్, ఎంపీడీవోలు ఆయేషా, తాళ్ల పరిణత ఉన్నారు.
