
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘కరెంట్’ టాపిక్ కాక రేపుతున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రాజేస్తున్నది. కాంగ్రెస్అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని, మూడు గంటల కరెంట్ కావాల్నో.. 24 గంటల కరెంట్ కావాల్నో తేల్చుకోవాలంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలంతా ప్రచార సభల్లో అంటున్నారు. దీనికి దీటుగా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు.
రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసిందే కాంగ్రెస్ అని, అమలు చేసింది కూడా కాంగ్రెస్సేనని అంటున్నారు. బీఆర్ఎస్ చెప్తున్న 24 గంటల ఉచిత కరెంట్ రాష్ట్రంలో ఎక్కడా లేదని, ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా 24 గంటలు నాణ్యమైన కరెంట్ను ఫ్రీగా రైతులకు సరఫరా చేస్తామని, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్తున్నారు.