బెంగాల్లోయాక్సిడెంట్.. 9 మంది మృతి

బెంగాల్లోయాక్సిడెంట్.. 9 మంది మృతి
  • బొలేరో, ట్రక్కు ఢీకొని ప్రమాదం 

పురులియా (బెంగాల్): బెంగాల్‌‌‌‌‌‌‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వెహికల్, ట్రక్కు ఢీకొని తొమ్మిది మంది మృతిచెందారు. పురులియా జిల్లాలోని 18వ నేషనల్​హైవేపై నామ్షోల్ గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

పెండ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో బొలెరో​లో ఉన్న 9 మంది మృతిచెందారు.  ప్రమాద తీవ్రతకు బొలేరో నుజ్జునుజ్జయింది. స్థానికులు, అత్యవసర సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే, వారంతా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు.