న్యూఢిల్లీ: ఓఎన్జీసీ క్యూ 2 నికర లాభం 30 శాతం తగ్గిపోయింది. విండ్ఫాల్ ట్యాక్స్ ఎఫెక్ట్తోనే సెప్టెంబర్ 2022 క్వార్టర్ లాభం రూ. 12,826 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది రెండో క్వార్టర్లో ఓఎన్జీసీకి రూ. 18,348 కోట్ల నికర లాభం వచ్చింది. జూన్ 2022 క్వార్టర్తో పోల్చినా నికర లాభం 15.6 శాతం తగ్గినట్లు ఓఎన్జీసీ తెలిపింది. ఉత్పత్తి చేసిన క్రూడాయిల్ గ్రాస్ బిల్లింగ్ పెరిగినప్పటికీ ఓఎన్జీసీకి లాభం తగ్గడం గమనించదగ్గ విషయం.
సెప్టెంబర్ క్వార్టర్లో గ్రాస్ బిల్లింగ్ బ్యారెల్కు 37.7 శాతం అధికమై 95.49 డాలర్లకు చేరింది. ఓఎన్జీసీ తాను వెలికి తీసిన క్రూడాయిల్ను ఇంటర్నేషనల్ బెంచ్ మార్కెట్ రేట్లకు రిఫైనరీలకు అమ్ముతుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ రేట్లు గ్లోబల్గా పెరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 1 నుంచి ప్రభుత్వం కొత్తగా విండ్ఫాల్ ట్యాక్స్ను అమలులోకి తెచ్చింది. దీనిని తెచ్చినప్పుడు బ్యారెల్కు ఏకంగా 40 డాలర్లను చెల్లించాల్సి వచ్చింది.
ప్రతీ 15 రోజులకోసారి గ్లోబల్ ఆయిల్ రేట్లను బట్టి విండ్ఫాల్ ట్యాక్స్ను అడ్జస్ట్ చేస్తున్నారు. దీంతో బ్యారెల్కు 75–76 డాలర్లు మాత్రమే ఓఎన్జీసీకి రియలైజేషన్గా లభిస్తోంది.