కరోనా కలకలం.. ఒక్కరోజులో 90 శాతం పెరిగిన కేసులు

కరోనా కలకలం.. ఒక్కరోజులో 90 శాతం పెరిగిన కేసులు

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. థర్డ్ వేవ్ తర్వాత భారీగా తగ్గిన కేసులు, మరణాలతో పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 2,183 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన కేసుల సంఖ్యతో పోల్చుకుంటే ఇది రెట్టింపుగా చెప్పొచ్చు. ఆదివారం 1,150 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో కేసులు రెండింతలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలోనే ప్రాంతాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంది.

వైరస్ బారిన పడి గత 24 గంటల్లో 214 మంది మృతి చెందారు.  డెత్ కేసులు ఎక్కువగా కేరళలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒక్కరోజులో 62 మంది కరోనాతో చనిపోయారు. ఆదివారం అక్కడ కొవిడ్ తో నలుగురు మాత్రమే మృతి చెందగా.. 24 గంటల్లో వేగంగా పెరిగింది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో 1,985 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్ లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 11,542గా ఉంది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 186.54 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. 

ఇవి కూడా చదవండి

ఈవారంలోనే పోలీసు నోటిఫికేషన్

లఖింపూర్ ఖేరీ కేసులో అశిష్ మిశ్రా బెయిల్ రద్దు

అఆలు రానోళ్లు.. సంతకాలు పెడుతున్నరు