108 ఎంపీ కెమెరాతో స్మార్ట్​ఫోన్లు

108 ఎంపీ కెమెరాతో స్మార్ట్​ఫోన్లు

ఇప్పుడు స్మార్ట్​ఫోన్లలో అట్రాక్టివ్​ ఫీచర్​ కెమెరానే. ఎంత మంచి కెమెరా ఉంటే ఆ ఫోన్​ అంతగా సక్సెస్​ అవుతోంది. అందుకే కంపెనీలు మార్కెట్​ కాపాడుకునేందుకు అడ్వాన్స్​డ్​ కెమెరాలతో ఫోన్లను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే 48ఎంపీ కెమెరాలతో కొన్ని ఫోన్లు ఆకట్టుకుంటుంటే, త్వరలో 108 ఎంపీ కెమెరా ఫోన్లు రాబోతున్నాయి. కొరియాకు చెందిన సామ్​సంగ్, చైనాకు చెందిన షావోమీ సంస్థలు కలిసి 108ఎంపీ కెమెరాను రూపొందిస్తున్నాయి. ఈ ఏడాది చివరికల్లా విడుదలయ్యే ఫోన్లలో 108 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాయి రెండు సంస్థలు.

‘ఐసోసెల్​ బ్రైట్​ హెచ్​ఎమ్​ఎక్స్’ సెన్సర్​ ద్వారా 108 ఎంపీ కెపాసిటీ కలిగిన కెమెరాను రూపొందిస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మొబైల్​ ఫోన్లలో ఒక సెన్సేషన్​గా చెప్పాలి. ఎందుకంటే 108 ఎంపీ కెపాసిటీ ‘హైఎండ్ డీఎస్​ఎల్​ఆర్’ కెమెరాల్లో మాత్రమే ఉంటుంది. కానీ, త్వరలో ఇది స్మార్ట్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంటుంది. ఈ కెమెరాతో సెకన్​కు 30 ఫ్రేమ్​లతో 6కె వీడియోలు తీయొచ్చు. దీనికంటే ముందే షావోమీ సంస్థ 64 ఎంపీ కెమెరాను మార్కెట్లోకి తీసుకొస్తుంది.​