ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ యోగా

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ యోగా

న్యూఢిల్లీ: ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి యోగా అని రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో యోగా సాధన చాలా ఉపకరిస్తుందని కోవింద్ సూచించారు. శరీరాన్ని, మనస్సును ఏకం చేసేందుకు మన పూర్వీకులు యోగాను అందించారని ట్వీట్ చేశారు. యోగాతో ఆరోగ్యం మెరుగవుతుందని, దీని ద్వారా లక్షలాది ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయన్నారు.