కరోనా ట్రీట్మెంట్ సెంటర్ లో యోగా చేసిన పేషెంట్లు, సిబ్బంది

కరోనా ట్రీట్మెంట్ సెంటర్ లో యోగా చేసిన పేషెంట్లు, సిబ్బంది

ఢిల్లీలోని అతిపెద్ద కరోనా ట్రీట్మెంట్ సెంటర్ లో పేషెంట్లు, సిబ్బంది యోగా చేశారు. పేషెంట్లు, సిబ్బంది యోగా సెషన్ లో పాల్గొన్నారు. ఛాతర్ పూర్ ఏరియాలోని రాధాస్వామి సత్సంగ్ బియాస్ లో 10వేల బెడ్లతో కరోనా కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. సర్ధార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ గా దీనిని పిలుస్తున్నారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది. ఇందులో ప్రస్తుతం 12వందల మంది పేషెంట్లు ఉన్నారు. ఇప్పటివరకు 5వేల 500 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.