యూట్యూబ్ చూసేటప్పుడు మొదట్లో లేదా మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. ప్రతిసారి అలా వస్తుంటే చిరాకొస్తుంది. పైగా కొన్ని సార్లు యాడ్స్ స్కిప్ చేసే ఆప్షన్ కూడా ఉండదు. అందుకని చాలామంది యాడ్ బ్లాకర్స్ వాడుతుంటారు.అయితే యాడ్ బ్లాకర్ వాడేవాళ్లకు యూట్యూబ్ ఒక ట్విస్ట్ ఇచ్చింది. యూట్యూబ్ ఈ మధ్య యాడ్స్ని పెంచింది. దాంతో చాలామంది యాడ్ బ్లాకర్ వాడుతున్నారు. అలాంటివాళ్లకు యూpreట్యూబ్ ఒక వార్నింగ్ నోటిఫికేషన్ ఇస్తోంది.
అదేంటంటే.. యాడ్ బ్లాకర్ డిజేబుల్ చేయకపోతే మూడు వీడియోల తర్వాత బ్లాక్ చేస్తారట. ఒకవేళ యాడ్స్ రావద్దనుకుంటే ప్రీమియంకు సబ్స్క్రయిబ్ కావాలని చెప్పింది. యాడ్ బ్లాకర్స్ వాడొద్దని నోటిఫికేషన్స్ పంపడం మామూలే. కాకపోతే యూట్యూబ్ పై ఆధారపడి ఎంతోమంది క్రియేటర్లు ఉన్నారు. వాళ్లకి ప్రతిఫలం దక్కాలి. యాడ్స్ ద్వారా వచ్చే డబ్బే దానికి ఆధారం. అయినప్పటికీ యూట్యూబ్ ఫ్రీగానే చూస్తున్నారు. యాడ్స్ వద్దనుకుంటే మాత్రం ప్రీమియంకు సబ్స్ర్కయిబ్ చేసుకోవాలి అని సూచించింది యూట్యూబ్.