హైదరాబాద్: బంగారు తెలంగాణలో అన్నం పెట్టే రైతు చావు కేకలను వినే దిక్కులేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. పంట పాడైతే నష్టపరిహారం అందించే దిక్కులేక, పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి నెలకొందన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే రైతు చావులను సర్కస్ లా చూస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ను నమ్మలేక, పురుగుల మందునే నమ్ముకొని అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ట్వీట్ చేశారు.
బంగారు తెలంగాణలో అన్నం పెట్టే రైతు చావు కేకలను వినే దిక్కులేదు.ఈ రోజు పంట పాడైతే నష్టపరిహారం అందించే దిక్కులేక,పెట్టిన పెట్టుబడి రాక, ఆదుకోవాల్సిన సర్కార్ రైతు చావులను సర్కస్ లా చూస్తుంటే,KCR ను నమ్మలేక లేక,చేసేది లేక పురుగుల మందునే నమ్ముకొని ఆత్మహత్యలు చేసుకొంటున్నారు రైతులు.1/2 pic.twitter.com/v41nLeX7A0
— YS Sharmila (@realyssharmila) December 16, 2021
వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు.. ఈ పాపం తనదు కాదని కేసీఆర్ పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారని షర్మిల విమర్శించారు. వందలాది మంది రైతుల చావులకు కారణమైన కేసీఆర్ పాపం ఊరికే పోదని దుయ్యబట్టారు. ‘మీరు రైతు హంతకులు. అన్నదాతలను కాటికి పంపుతున్న మీ ప్రభుత్వానికి రేపు పాడె కట్టేది, మీ అధికారానికి పాతరేసేది రైతులే’ అని ట్వీట్ లో షర్మిల విమర్శించారు.
మరిన్ని వార్తల కోసం: