చైనాలో ఓ కొత్త రూల్ రానుంది. పిల్లలు, యుక్తవయస్కులు రాత్రిపూట ఇంటర్నెట్ను వాడకుండా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇంటర్నెట్ వ్యసనానికి వ్యతిరేకంగా పోరాడే లక్ష్యంతో ఇటీవల ఆవిష్కరించబడిన కొత్త నిబంధనల ప్రకారం వారు స్మార్ట్ఫోన్ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. పబ్లిక్ కన్సల్టేషన్ను అనుసరించి సెప్టెంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చే ఆంక్షల ప్రకారం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరైనా రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య మొబైల్ ఇంటర్నెట్ను వాడడానికి చేయడానికి వీల్లేదు.
స్మార్ట్ఫోన్ వినియోగ సమయాన్ని నిర్వహించడానికి టైర్డ్ సిస్టమ్ కూడా విధించారు. 16, 17 ఏళ్ల వయస్సు గల వారికి ఎనిమిది నుంచి రెండు గంటలు, అంత కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి రోజుకు గరిష్టంగా 40 నిమిషాలు ఇంటర్నెట్ యూజ్ చేసేందుకు అనుమతించింది. ఈ కొత్త నియమాలను చైనా సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CAC) ప్రతిపాదించినవి. అంతే కాదు ఇవి ప్రపంచంలోనే అత్యంత కఠినమైనవి.
2021లో, చైనా.. ఈ వ్యసనానికి వ్యతిరేకంగా పోరాడే లక్ష్యంతో పిల్లల కోసం గేమింగ్ సమయాన్ని పరిమితం చేసింది. కొత్త గేమ్ల ఆమోదాలను తొమ్మిది నెలల పాటు స్తంభింపజేసింది. ఇది సెక్టార్ టైటాన్ టెన్సెంట్తో సహా అనేక కంపెనీల దిగువ స్థాయిలను దెబ్బతీసింది. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయం దేశీయ టెక్ దిగ్గజాలపై బీజింగ్ నియంత్రణ కొనసాగుతుందని సూచిస్తుంది.