‘నవ్విన నాప చేనే పండుతుంది’.. అవును ఇది అక్షరాల నిజం. పెద్దపల్లి జిల్లా పోతారంకి చెందిన రైతు వెంకట్రావ్ గురించి తెలుసుకుంటే మీరూ ఈ మాటే అంటారు.
మెదక్ / నిజాంపేట, వెలుగు: వెంకట్రావ్ నాలుగేళ్ల కిందట నిజాంపేట చల్మెడలో 40 ఎకరాల భూమి కొన్నాడు. మార్కెట్ని బట్టి పామాయిల్ వచ్చే ఆయిల్పామ్ పంట వేయాలనుకున్నాడు. కానీ, సెంట్రల్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్లో తన భూమి ఆయిల్ పామ్ సాగుకి అనుకూలం కాదని తేలింది. అయినా సరే నేలతల్లిని నమ్ముకుని ధైర్యం చేశాడు వెంకట్రావ్. ఇరవై ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు మొదలుపెట్టాడు. అది చూసి ఇరుగుపొరుగు నవ్వారు. అయినా వెనకడుగేయలేదు. పొలంలో 3.20 లక్షల లీటర్ల కెపాసిటీతో ఒక సంపు, 2.80 లక్షల లీటర్ల కెపాసిటీతో మరో సంపు పెట్టి డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. రేయింబవళ్ళు కష్టం చేసి మంచి దిగుబడి సాధించాడు. వెంకట్రావ్ సక్సెస్ని చూసి తోటి రైతులు ఆశ్చర్యపోతున్నారు. రీసెర్చర్లు వెంకట్రావ్ పొలానికి ‘క్యూ’ కడుతు న్నారు. విచిత్రం ఏంటంటే ఈ మధ్య హార్టికల్చర్ ఆఫీసర్లు మరోసారి అక్కడి మట్టిని టెస్ట్ చేస్తే.. పామాయిల్ బంగారంలా పండుతుందని తేలింది. వెంకట్రావ్ని చూసి చుట్టుపక్కల రైతులు కూడా ఆయిల్పామ్ సాగుకి ముందుకొస్తున్నారు.
పామాయిలే బెటర్
మా దగ్గరి చుట్టాల్లో ఒకరు పదెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. వాళ్లకి మంచి లాభాలు వస్తుండటంతో నేను కూడా 20 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు మొదలుపెట్టా. మిగతా పంటలతో పోలిస్తే పదిరూపాయలు ఎక్కువే మిగులు తున్నాయి. ఆయిల్పామ్ తోటలో షెడ్ వేసి 8 ఆవులు, 120 గొర్రెలను పెంచుతున్నా.. వాటి ద్వారా వచ్చే ఆదాయంతోనే కూలీ ఖర్చులు వెళ్లదీస్తున్నా. - వెంకట్రావ్
: