షూలో 3 కిలోల బంగారం దాచి అడ్డంగా దొరికిన్రు

షూలో 3 కిలోల బంగారం దాచి అడ్డంగా దొరికిన్రు

ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో  భారీగా బంగారం పట్టుబడింది. మార్చి  10న   అడిస్ అబాబా నుంచి ముంబైకి వచ్చిన ముగ్గురు విదేశీయుల నుంచి రూ.1.40 కోట్ల విలువైన 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూ,  లోదుస్తుల్లో  బంగారం దాచినట్లు అధికారులు గుర్తించారు.  ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.