అత్యాచారం చేసి చంపి.. సెప్టిక్​ ట్యాంకులో పడేసిన్రు

అత్యాచారం చేసి చంపి.. సెప్టిక్​ ట్యాంకులో పడేసిన్రు

పర్వతగిరి, వెలుగు: మహిళపై అత్యాచారం చేసి చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోని సెప్టిక్​ ట్యాంకులో పడేసిన ఘటన వరంగల్​రూరల్​ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో మంగళవారం వెలుగుచూసింది. మామునూర్ ​ఏసీపీ నరేశ్​కుమార్​ వివరాల ప్రకారం.. అన్నారానికి చెందిన మహిళ(50) ప్రతి శుక్రవారం అన్నారంలో జరిగే కందూర్ల వద్దకు వెళ్లి అక్కడ అన్నం, డబ్బులు అడుక్కుంటుంది. ఈ క్రమంలో ఈ నెల 4న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తెల్లవారి కుటుంబసభ్యులు గ్రామంలో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఈ నెల 6న ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగించారు. పక్కా సమాచారం మేరకు అన్నారంలోని పోడేటి సారయ్య ఇంట్లో ని సెప్టిక్​ ట్యాంకులో శవం ఉన్నట్లు తెలిసింది. శవాన్ని బయటకు తీసి ఘటనా స్థలంలోనే ఇద్దరు డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించారు. ఇద్దరు అత్యాచారం చేసి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఏసీపీ చెప్పారు.