జైపూర్ లో బోరు మోటర్​ పంపు దొంగల అరెస్ట్

జైపూర్ లో  బోరు మోటర్​ పంపు దొంగల అరెస్ట్

జైపూర్, వెలుగు: బోరు మోటర్ ​పంపులను చోరీ చేస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు జైపూర్ ఏసీపీ మోహన్ తెలిపారు. మంగళవారం జైపూర్ పోలీస్​ స్టేషన్​లో శ్రీరాంపూర్ సీఐ రమేశ్ బాబు తో కలిసి వివరాలను వెల్లడించారు. గత కొన్ని రోజులుగా మండలంలో బోరు మోటర్లు ​చోరీకి గురవుతున్నాయి. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రసూల్ పల్లె బస్టాప్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు చోరీ చేసిన బోరు మోటర్​ పంపును బైక్​పై పెట్టుకుని వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

వారిని మందమర్రి మండలంలోని వెంకటాపూర్​కు చెందిన కుమ్మరి వెంకటేశ్, కామెర రాజ్ కుమార్, సల్లూరి రాకేశ్​గా గుర్తించారు. విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. ఇప్పటివరకు 5 బోరు మోటర్​ పంపులను చోరీ చేసి.. నాలుగింటిని అమ్మినట్లు చెప్పారు. మరోదాన్ని అమ్మేందుకు తీసుకెళ్తూ పోలీసులకు చిక్కారు. నస్పూర్​కు చెందిన గుంజపడుగు తిరుపతికి అమ్మిన 3 మోటర్​  పైపులను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. నిందితులతోపాటు బైక్ ను సీజ్ చేసి రిమాండు కు పంపినట్లు చెప్పారు.