సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ సెక్రటరీ సంపత్​కుమార్​ వినతిపత్రం

సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ సెక్రటరీ సంపత్​కుమార్​ వినతిపత్రం

శాంతినగర్, వెలుగు: అలంపూర్  నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ సెక్రటరీ సంపత్​కుమార్​ వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్​లో సోమవారం ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో సోమవారం జరిగిన రివ్యూ మీటింగ్​లో ఆయన పాల్గొన్నారు.

సీఎంతో పాటు  మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావులను కలిసి సమస్యలను వివరించారు. అలంపూర్  నియోజకవర్గానికి సంబంధించి మూడు రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు బస్సు డిపో ఏర్పాటు, 100 పడకల ఆసుపత్రిలో సిబ్బంది ఏర్పాటు చేయాలని కోరారు.