అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ల పండుగ.. సేల్ షురూ

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ల పండుగ.. సేల్ షురూ

ఆన్ లైన్ లో ఆఫర్ల పండుగ మొదలైంది. భారీ డస్కౌంట్లు, ఆఫర్లతో ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దసరా, దీపావళి సంబురాలు మొదలు పెట్టేశాయి. రెండు సంస్థలూ రేపటి నుంచి సేల్ ప్రారంభిస్తున్నాయి. అక్టోబర్ 4 వరకు కస్టమర్లకు స్పెషల్ ఆఫర్లు అందిస్తున్నాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, కాస్మోటిక్స్, స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్ లు.. ఇలా ఒకటేంటి నిద్ర లేచింది.. మొదలు రాత్రి పడుకునే వరకు మనం వాడే అన్ని వస్తువులపై ఆఫర్లు ప్రకటించాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో వస్తే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో కస్టమర్ల ముందుకొస్తోంది.

బ్యాంకు ఆఫర్లు

SBI, HDFC, ICICI వంటి కొన్ని బ్యాంకుల క్రెడిట్, డిబిట్ కార్డులు ఉన్న వాళ్లకు అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి ఫ్లిప్ కార్ట్, అమెజాన్. వీటితో పాటు నో కాస్ట్ ఈఎంఐ, పే లేటర్ ఆప్షన్లనూ ఇచ్చాయి. ఎక్సేంజ్ ఆఫర్లనూ ప్రకటించాయి. బడ్జెట్ మొబైల్ ఫోన్లపై అయితే రెండు సంస్థలూ పోటీ పడి మరీ ఆఫర్ల వెల్లువ కురిపించాయి.

స్పెషల్ కస్టమర్లకు సేల్ ఇవాళ్టి నుంచే..

రెండు ఈ-కామర్స్ సంస్థలు వాటి స్పెషల్ కస్టమర్లకు అడ్వాన్స్ సేల్ ప్రారంభిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు, ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు రాత్రి 8 గంటలకు ఆఫర్ సేల్ షురూ.