రేపు హైదరాబాద్కు వైఎస్ జగన్

రేపు హైదరాబాద్కు వైఎస్ జగన్

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ రేపు సోమవారం హైదరాబాద్ వెళ్లనున్నారు. శంషాబాద్‌లో‌ శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొంటారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. రేపు సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌ చేరుకుని అక్కడ నుంచి చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. రాత్రి 9.05 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్‌.

 

ఇవి కూడా చదవండి...

ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా

ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు

సంగీత ప్రపంచానికి ఆమె లేని లోటు తీర్చలేనిది: ఏఆర్ రెహ్మాన్