బీజింగ్: చైనా, తైవాన్మధ్య పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాము ఎంత తీవ్రంగా హెచ్చరించినా పట్టించుకోకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించడంపై చైనా ఆగ్రహంగా ఉంది. తమ హెచ్చరికలను బేఖాతరు చేసినందుకు తైవాన్జలసంధిలో గురువారం మధ్యాహ్నం చైనా మిలిటరీ సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ మీడియా చైనా డైలీ తెలిపింది. తైవాన్ను చైనా తన భూభాగంలో భాగంగా చూస్తున్నది. అమెరికా స్పీకర్పెలోసీ.. తైవాన్లో పర్యటించడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. గత 25 ఏళ్లలో యూఎస్ స్పీకర్అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. తమ వినతులు, హెచ్చరికలను పట్టించుకోకుండా పెలోసీ తైవాన్లో పర్యటిస్తే చైనా–అమెరికా మధ్య సంబంధాలపై తీవ్రంగా ప్రభావం పడుతుందని చైనా ఇప్పటికే అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. అయినా అవేమీ పట్టించుకోకుండా పెలోసీ.. తైవాన్లో అడుగుపెట్టారు. బుధవారం ఇక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు. అప్పటి నుంచి అమెరికాపై చైనా కోపంగా ఉంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం తైవాన్తూర్పు భాగాల్లోని జలసంధిలో పీపుల్స్లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఈస్టర్న్ థియేటర్ కమాండ్సైనిక విన్యాసాలు (ఆర్మీ డ్రిల్స్) చేపట్టిందని చైనా డైలీ వెల్లడించింది. ‘‘మంగళవారం రాత్రి నుంచే తైవాన్ భూభాగాల్లోని గగనతలం, జలాల్లో పీఎల్ఏ సైనిక విన్యాసాలు జరుపుతోంది. తాజాగా చేసిన డ్రిల్స్ లో అనుకున్న ఫలితాలను పీఎల్ఏ సాధించింది” అని ఆ దేశ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకుమించిన వివరాలను వెల్లడించలేదు. అక్కడి సముద్ర జలాల్లో ఉన్న నౌకలకు ఎంతమేర నష్టం జరిగిందో తెలియరాలేదు. పెలోసీని తమ భూభాగంలో అడుగుపెట్టనివ్వడం వల్ల.. ఇలాంటి డ్రిల్స్నిర్వహించి తైవాన్ను మరింత బెదిరింపులకు గురిచేయాలన్నది చైనా వ్యూహంగా కనబడుతోంది. తద్వారా తైవాన్ను పూర్తిగా అష్టదిగ్బంధం చేయాలని భావిస్తోంది. చైనా ఆర్మీ డ్రిల్స్ నిర్వహిస్తున్న తైవాన్నైరుతి ప్రాంతంలో అమెరికా నేవీ వివిధ యుద్ధ నౌకలు, హెలికాప్టర్లతో ఇంతకుముందే అక్కడికి చేరుకుంది.
ఫ్లైట్లను క్యాన్సిల్ చేసిన తైవాన్
తమ దేశ భూభాగాల్లో చైనా ఆర్మీ డ్రిల్స్ చేసిన నేపథ్యంలో తైవాన్ దేశం ఎయిర్ లైన్ఫ్లైట్లను రద్దు చేసుకుంది. తైవాన్ నుంచి కనీసం 40 విమానాలు రద్దయి ఉండవచ్చని చైనా మీడియా పేర్కొంది. సముద్ర మార్గం ద్వారా వివిధ సరుకులను చేరవేసేందుకు అక్కడున్న నౌకలపై చైనా సైనిక విన్యాసాలు ఏ మేరకు ప్రభావం చూపాయో తైవాన్ మీడియా వెల్లడించలేదు. కాగా చైనా ఆర్మీ డ్రిల్స్తో అన్ని వైపుల నుంచి తైవాన్ పూర్తిగా దిగ్బంధం అయిందని హాంగ్కాంగ్ న్యూస్ పేపర్‘ద సౌత్చైనా మార్నింగ్ పోస్ట్’ పేర్కొంది.