గందమల్ల రిజర్వాయర్ హామీ ఏమైంది?: బీర్ల అయిలయ్య

గందమల్ల రిజర్వాయర్ హామీ ఏమైంది?:  బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు:  గందమల్ల రిజర్వాయర్‌‌‌‌ పూర్తిచేసి ఆలేరును సస్యశ్యామలం చేస్తామన్న ఎమ్మెల్యే సునీత హామీ ఏమైందని ఆలేరు కాంగ్రెస్‌‌ అభ్యర్థి బీర్ల అయిలయ్య- ప్రశ్నించారు. బుధవారం  యాదగిరిగుట్ట  పట్టణ మాజీ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, మండల కోఆప్షన్ మాజీ సభ్యులు సయ్యద్ సలీంతో పాటు మరో 300 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎమ్మెల్యే సునీత దత్తత తీసుకున్న గ్రామాల్లో కూడా కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు. 

రెండు సార్లు  గెలిచి తన ఆస్తులను పెంచుకున్నారే తప్ప ఆలేరును అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, పట్టణ అధ్యక్షుడు  బిక్షపతి,  మాజీ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ గౌడ్,  ఎంపీపీ గందమల్ల అశోక్,  వంగపల్లి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.