గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు అండగా వివేక్ వెంకటస్వామి

గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు అండగా వివేక్ వెంకటస్వామి

సిద్దిపేట జిల్లాలో పర్యటించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి.  అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసిత  రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వివేక్ మట్లాడుతూ మల్లన్న సాగర్ లో భూనిర్వాసితులకు ఇచ్చిన నష్టపరిహారాన్ని గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు జనవరి 3వ తేదీ లోపు సమస్యలు పరిష్కరించకపోతే గౌరవెల్లి భూనిర్వాసితులను కేంద్ర మంత్రి దగ్గర తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా రైతులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు వివేక్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో నష్టపరిహారం ఇచ్చాకనే పని ప్రారంభించాలని అంటే ఒంటెద్దు పోకడతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పై దాడి చేస్తూ పని ప్రారంభించడం చాలా బాధాకరమన్నారు. 

ఇవి కూడా చదవండి:

హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో ప్రత్యేక పూజలు

కేబుల్‌ బ్రిడ్జి వద్ద రూ.6 కోట్లతో డైనమిక్ లైటింగ్