టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు..ఐదుగురు మృతి

టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు..ఐదుగురు మృతి

తమిళనాడులోని విరుదు నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. సత్తూర్ పట్టణంలోని  సిప్పిపరైలో ఉన్న టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో  ఐదుగురు మృతి చెందగా..మరో నలుగురికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే మూడు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటన జరిగినప్పుడు 30 మంది కార్మికులు ఫ్యాక్టరీ లోపల ఉన్నారు.  అధిక వేడి వల్ల ఫ్యాక్టరీ లోపల ఉన్న ఫైర్ క్రాకర్స్  వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. బాధితుల గుర్తింపు ఇంకా తెలియలేదు. ఫ్యాక్టరీ లోపల ఇంకా ఎంత మంది చిక్కుకున్నారో కూడా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

see more news

రెండో పెళ్లి చేసుకున్నఅమలాపాల్ .. ఫోటోలు వైరల్

బాలీవుడ్ సింగర్ కు కరోనా..లండన్ నుంచి రాగానే మూడు పార్టీలకు అటెండ్

కరోనా వైరస్ ఒక బయలాజికల్ వార్