
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీ భాగ్యలక్ష్మీ దేవాలయం, బైంసా, ఉట్కూర్ గ్రామాలను దత్తత తీసుకుంటానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోలీసుల దాడిలో గాయపడ్డ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. 69 జీవోను అమలు చేసి మక్తల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మే 5వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 14వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూర్ లో బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారు.
మరిన్ని వార్తల కోసం..