
బీజింగ్: భారత్, పాకిస్తాన్ మధ్య శాశ్వత కాల్పుల విరమణ కోసం తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా ప్రకటించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచి తాము తటస్థంగా ఉన్నామని, సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చామని పేర్కొంది. పాకిస్తాన్ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మహ్మద్ఇషాఖ్ దార్మూడు రోజుల చైనా పర్యటన సోమవారం మొదలైంది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ను భారత్, పాక్ అంశంపై మీడియా ప్రశ్నించింది.
ఇందుకు ఆమె స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్య శాశ్వత సీజ్ఫైర్ కోసం తాము ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటికే ఇరు దేశాలు సీజ్ఫైర్కు అంగీకరించాయని, దాన్ని శాశ్వతం చేసేందుకు తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పారు. చైనా, పాకిస్తాన్ మధ్య ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని పాక్డిప్యూటీ పీఎం దార్ తమ దేశానికి వచ్చారని ఆమె తెలిపారు.
కాగా, పాకిస్తాన్కు ఎయిర్డిఫెన్స్, శాటిలైట్సహకారాన్ని చైనా అందించడం వెనుక ఉద్దేశమేమిటని.. పాకిస్తాన్ఉపయోగించిన చైనా డిఫెన్స్సిస్టమ్ఇండియన్డిఫెన్స్సిస్టమ్ముందు నిలవలేకపోయిందన్న కథనాలపై ఏమంటారని మీడియా ప్రశ్నించగా.. ఆమె దాటవేశారు. సంబంధిత అథారిటీని అడగాలని తప్పించుకున్నారు.
మూడు రోజులు చైనాలో పాక్ ఉప ప్రధాని పర్యటన
పాకిస్తాన్ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మహ్మద్ఇషాఖ్దార్మూడు రోజుల చైనా పర్యటన కోసం సోమవారం బీజింగ్కు చేరుకున్నారు. భారత్చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత చైనాలో ఆయన పర్యటిస్తుండటం ఇదే మొదటి సారి. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులపై చైనా ప్రభుత్వంతో ఆయన చర్చించనున్నారు. సింధూ జలాల ఒప్పందం రద్దు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తున్నది.
చైనా నుంచి మరింత డిఫెన్స్సాయాన్ని పాకిస్తాన్ కోరనున్నట్లు సమాచారం. దార్వెంట పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా.. 2020 నుంచి 2024 మధ్య పాకిస్తాన్కు చైనా భారీగా ఆయుధాలను సరఫరా చేసింది. ఇందులో ఫైటర్ జెట్లు, రాడార్లు, నౌకలు, సబ్మెరైన్స్, మిసైల్స్ ఉన్నాయి. ఈ వివరాలను ఇటీవల స్టాక్హోమ్ఇంటర్నేషనల్పీస్రీసెర్చ్ఇన్స్టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) రిపోర్ట్ బయటపెట్టింది.